ఉత్తరప్రదేశ్ లోని లక్నో కోర్టు ఆవరణలో కాల్పులు కలకలం సృష్టించాయి.న్యాయస్థానం ప్రాంగణంలోనే గ్యాంగ్ వార్ జరిగిందని తెలుస్తోంది.
కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో ముక్తార్ అన్సారి అనుచరుడు సంజీవ్ జీవను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు.దాడికి పాల్పడిన వారు లాయర్ల వేషధారణలో వచ్చారని సమాచారం.
కాగా ఈ కాల్పుల్లో ఇద్దరు పోలీసులకు గాయాలు అయ్యాయి.కాల్పుల నేపథ్యంలో కోర్టు వద్ద పోలీసులు భారీగా మోహరించారు.