పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ఇలవేల్పు అమ్మలగన్న అమ్మ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 59 వ వార్షికోత్సవంలో భాగంగా నీరుల్లి కూరగాయల పండ్ల వర్తక సంఘం వారు సినీనటుడు జెడి చక్రవర్తి ని హంస రదంపై భీమవరంలో మేళతాళాలతో బాణాసంచా కాలుస్తూ ఊరేగిస్తూ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానానికి చేరుకుని ముందుగా ఆలయ ప్రధాన అర్చకులు ఆలయం మర్యాదలతో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం వేదికపై నీరుల్లి కూరగాయల వర్తక సంఘం చేతుల మీదగా
ప్రముఖ హీరో జెడి చక్రవర్తి కి గజమాల, పూల కిరీటంతో సత్కరించి, సువర్ణ కంకణం వారికి ధరించి ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మావుళ్ళమ్మ దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ మానేపల్లి నాగేశ్వరరావు, ధర్మకర్తల మండలి సభ్యులు, నీరుల్లి వర్తక సంఘం సభ్యులు పాల్గొన్నారు.జెడి చక్రవర్తి మాట్లాడుతూ శ్రీ మావుళ్ళమ్మను దర్శించుకోవడం, ప్రజల ఆదరాభిమానాలు పొందటం చాలా సంతోషంగా ఉందని, ఈ సన్మానం ఎప్పటికీ మరువలేనిదని తెలియజేశారు.