ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు మరో రెండు రోజుల్లో బాధ్యతల నుంచి తప్పుకోబోతున్నారు.ఈ నేపథ్యంలో రాజ్యసభలో వెంకయ్య సేవలపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు.
ఇది ఎంతో ఉద్వేగపూరతమైన సందర్భం అని, సభకు సంబంధించి ఎన్నో మధురమైన, చారిత్రక క్షణాలు మీ మనోహరమైన ఉనికితో ముడిపడి ఉన్నాయని వ్యాఖ్యనించారు.
వెంకయ్యనాయుడు విశిష్టత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనని మోదీ అన్నారు.
వెంకయ్య యువతకు స్ఫూర్తిగా నిలిచారన్నారు.అదేవిధంగా భాషలపై ఆయనకున్న పట్టు ఎంతో ఉన్నతమైనది.
కష్టమైన, ఒత్తిళ్ల మధ్య మీ పాత్రను సమర్థంగా నిర్వర్తించారు.దేశానికి మీరు చేసిన సేవలు వెల కట్టలేనివని మోదీ తెలిపారు.
వెంకయ్యతో కలిసి పనిచేయడం గర్వంగా ఉందన్నారు.ఆయన ఎన్నో బాధ్యతలు చేపట్టడమే కాకుండా, ప్రతి పనిని అంకిత భావంతో నిర్వహిస్తారని ప్రధాని మోదీ ప్రసంగంలో పేర్కొన్నారు.