తాము ఎంతగానో అభిమానించే హీరోల కోసం ఏం చేయడానికైనా వెనుకాడని ఫ్యాన్స్ అవకాశం వస్తే తమ హీరో కోసం సాహాసాలు, సంచలనాత్మక నిర్ణయాలు తీసుకోవడానికి కూడా వెనుకాడరు.ఇదే విషయం మరోసారి నిరూపించబడింది.
అది జూనియర్ ఎన్టీయార్ విషయంలో.
ఇంతకు ఎన్టీయార్ వీరాభిమాని చేసిన పని ఏంటో తెలిస్తే మీరు కూడా షాక్ అవడం ఖాయమట.
అదెంటో తెలుసుకుంటే.జూనియర్ ఎన్టీఆర్ గత నెలలో నెహ్రూ ఔటర్ రింగు రోడ్డు మీద మితిమీరిన వేగంతో కారు నడిపినందుకు తెలంగాణ పోలీసులు రూ.1035 జరిమానా విధించారు.అయితే ఆ చలాన్ ఇప్పటివరకు తారక్ చెల్లించనే లేదట.
అయితే ఈ విషయం గ్రహించిన ఆ అభిమాని పోలీసులు విధించిన చలాన్ మొత్తం కట్టేసి, ఆ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సార్ మీ చలాన్ కట్టినందుకు ప్రతిఫలంగా నాతో పాటు నా స్నేహితులకు కూడా మల్లికార్జున లేదా భ్రమరాంభ థియేటర్లలో ఆర్ఆర్ఆర్ టికెట్లు ఇప్పించండని రిక్వస్ట్ పెట్టాడట.ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది.
అయితే ఆ అభిమాని అభిమానానికి తారక్ స్పందన ఎలాఉందో ఇప్పటి వరకు తెలియదు గానీ ఈ హీరో నుండి వచ్చే సందేశం కోసం ఆ అభిమాని మాత్రం ఆశతో ఎదురు చూస్తున్నాడట.