పల్నాడు జిల్లా వినుకొండలో తీవ్ర ఉద్రిక్తత

పల్నాడు జిల్లా వినుకొండలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.వైసీపీ నేతలు అక్రమాలు చేస్తున్నారని ఆరోపిస్తూ టీడీపీ శ్రేణులు బస్టాండ్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.

టీడీపీ నేతల ఆందోళనకు వ్యతిరేకంగా వైసీపీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.ఈ క్రమంలోనే టీడీపీ, వైసీపీ కార్యకర్తలు పరస్పరం రాళ్ల దాడులకు పాల్పడ్డారు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలపై లాఠీ ఛార్జ్ చేశారని తెలుస్తోంది.అనంతరం పరిస్థితిని అదుపు చేసేందుకు వినుకొండ సీఐ గాల్లోకి కాల్పులు జరిపారు.

అనంతరం పరిస్థితి సద్దుమణిగింది.

Advertisement
నాగార్జునతో ప్రతి ఒక్కరు ప్రేమలో పడతారు.. కుష్బూ సంచలన వ్యాఖ్యలు!

తాజా వార్తలు