నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం అహోబిలంలో టోల్ గేటు సిబ్బంది నిర్వాకంపై మాజీమంత్రి భూమా అఖిలప్రియ మండిపడ్డారు.అహోబిలం గ్రామానికి వెళ్తున్న ఆమె కారుకు టోల్ గేటు నిర్వాహకులు రుసుం వసూలు చేశారు.పంచాయతీ అధికారులు నిర్ణయించిన ధర కాకుండా అధికంగా రూ.150 వసూలు చేశారని ఆరోపించారు.నిబంధనలను అతిక్రమించి భక్తుల నుంచి అక్రమంగా అధిక వసూళ్లకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.మరోసారి ఇలా అక్రమ వసూళ్లకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు.
తాజా వార్తలు