ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తమాషా రాజకీయాలు జరుగుతున్నాయంటూ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
సొంత పార్టీలో కొందరు పార్టీని వదిలి బయటకు వెళ్లే పరిస్థితి లేదని చెప్పారు.అందుకే పూటకో మాట మాట్లాడుతూ కాలం గడుపుతున్నారంటూ విమర్శించారు.
బీఆర్ఎస్ కు రాజీనామా చేసి వేరే పార్టీలో చేరి మీ బలం చూపించాలంటూ సవాల్ చేశారు.ఉమ్మడి జిల్లాలో రెండుసార్లు జరిగిన ఎన్నికల్లో పార్టీ నష్టపోయిందని తెలిపారు.
కానీ ఈసారి మాత్రం జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోనూ గులాబీ జెండానే ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు.