విపత్తు అని ముందే తెలిసినా ప్రభుత్వం అలర్ట్ కాలేదు..: చంద్రబాబు

మిగ్ జామ్ తుపానుపై టీడీపీ అధినేత చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా పార్టీ నేతలకు, కార్యకర్తలకు ఆయన దిశానిర్దేశం చేశారు.

 Even Though It Was Known About The Disaster, The Government Was Not Alerted..: C-TeluguStop.com

తుపాను ప్రభావంతో కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా ఉండాలని పార్టీ కార్యకర్తలకు చంద్రబాబు సూచనలు చేశారు.ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూడొద్దని చెప్పారు.

వర్ష ప్రభావిత బాధితులకు భోజనం, తాగునీరు అందేలా చూడాలని నేతలకు ఆదేశాలు జారీ చేశారు.అలాగే బాధితులకు సాయం అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

విపత్తు అని ముందే తెలిసినా ప్రభుత్వం అలర్ట్ కాలేదని ఆరోపించారు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తుపాను బాధితులకు వెంటనే సాయం చేయాలని డిమాండ్ చేశారు.

పెరిగిన సాగు ఖర్చులను దృష్టిలో పెట్టుకుని పరిహారం అందించాలన్న చంద్రబాబు ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు సర్కార్ లెక్కలు వేసుకోకూడదని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube