టాలీవుడ్ లో వెయ్యి అబద్ధాలు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన బెంగళూరు భామ ఎస్తర్.ఈ అమ్మడు సింగర్ గా కెరియర్ మొదలు పెట్టి తరువాత నటిగా మారింది.
ఈ ప్రయాణంలో నటిగా అనుకున్న స్థాయిలో గుర్తింపు రాకున్న పెద్ద స్టార్ హీరోయిన్ అవ్వాలనే ఆలోచనలు లేకపోవడంతో వచ్చిన అవకాశాలు చేసుకుంటూ పోతుంది.ఇక హీరోయిన్ గా ఉన్న సమయంలోనే సింగర్, నటుడు నోయల్ ని పెళ్లి చేసుకుంది.
ఇద్దరూ కలిసి మూడు నెలలు మాత్రమే ఉన్నారు.తరువాత ఏవో కారణాలతో దూరమైపోయి కొద్ది నెలల క్రితం విడాకులు తీసుకున్నారు.
ఇక ఈ అమ్మడు విడాకుల తర్వాత మరల నటిగా తన ప్రయాణం కొనసాగిస్తూనే ఉంది.ప్రస్తుతం ఈ భామ షకీలా బయోపిక్ లో ఆమె స్నేహితురాలి పాత్రలో నటించింది.
రీచాచద్దా మెయిన్ లీడ్ గా చేసిన ఈ సినిమా త్వరలో తెలుగు, తమిళ్, కన్నడ బాషలలో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.ఈ సందర్భంగా మీడియా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలని షకీలా గురించి ఎస్తర్ పంచుకుంది.
షకీలా చిత్రం చేయడం అదృష్టంగా భావిస్తున్నాను.షకీలా పాత్రకు బ్యాక్ గ్రౌండ్ లో నీడలా ఉండే ట్రైలర్ మేడ్ పాత్రను చేసినందుకు సంతోషంగా ఉంది.ఆ పాత్ర నాకు చాలా బాగా కనెక్ట్ అయ్యింది.సినిమా విడుదల తర్వాత చాలా మంది ఆ పాత్రలో నేను నటించిన తీరుకు అభినందిస్తున్నారు.
ఆ పాత్రను నాతో ఎందుకు వేయించారో ఇప్పుడే అర్థం అయ్యింది.తెలుగులో కూడా తప్పకుండా ప్రతి ఒక్కరికి నచ్చుతుందని భావిస్తున్నాను.
ఈ సినిమా తో నా కెరీర్ మరింత స్పీడ్ గా ముందుకు సాగుతుందని ఆశిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది.