హైదరాబాద్ లోని హయత్ నగర్ లో ఇంజనీరింగ్ విద్యార్థులు రేవ్ పార్టీని నిర్వహించారు.బర్త్ డే సెలబ్రేషన్స్ పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డారని తెలుస్తోంది.
సమాచారం అందడంతో రంగంలోకి దిగిన పోలీసులు తనిఖీలు నిర్వహించారు.ఈ నేపథ్యంలో పార్టీలో నిషేధిత గంజాయిని వినియోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
రేవ్ పార్టీలో పాల్గొన్న 29 మంది యువకులతో పాటు నలుగురు అమ్మాయిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అదేవిధంగా 50 గ్రాముల గంజాయితో పాటు 11 కార్లు, ఒక బైకు, 28 మొబైల్స్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం స్టూడెంట్స్ కు తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు వారిని వదిలివేశారని సమాచారం.మళ్లీ విచారణకు రావాలని స్పష్టం చేశారు.