శనివారం బోయినీపల్లి మండలం రత్నంపేట గ్రామంలో ఉపాధి హామీ కూలీల చేత మిడ్ మానేర్ డ్యాం కింద కొత్తగా తీసిన కాల్వ పక్కన ఉన్న భారీ ఎత్తున ఉన్న మొరం కుప్పలు ఉపాధి హామీ కూలీలచే ట్రాక్టర్ల ద్వారా మొరం నింపే పనులు నిర్వహిస్తున్నారు.మొరం కుప్పలు ఉపాధి హామీ కూలీల మీద పడి జరగరాని సంఘటన జరిగితే మరి దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని సిపిఎం సిపిఎం పార్టీ నాయకులు గురజాల శ్రీధర్ ప్రశ్నించారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ కూలీలకు పనిచేసే చోట ఏదైనా ప్రమాదం జరిగితే ఇప్పటివరకు కూడా ఆ కుటుంబాలకు నష్టపరిహారం ఇచ్చిన దాఖలు లేదు
మరి మొన్నటికి మొన్న కోనరావుపేట మండలం వెంకట్రావుపేట గ్రామంలో మట్టి పిల్లలు కూలి ఒక మహిళా చనిపోవడం జరిగిందని గుర్తు చేశారు.మరి రత్నంపేట గ్రామంలో ప్రమాదపు అంచున పని చేయించడం వల్ల ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటది కాబట్టి, తక్షణమే ఆ మొరం పనులు ప్రక్రియను నిలిపివేయాలని వారికి వేరే చోట ఉపాధి హామీ కూలీలకు పని కల్పించాలని సిపిఎం పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది.
అలాగే పని చేస్తున్న అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మండల సిపిఎం పార్టీ కన్వీనర్ గురుజాల శ్రీధర్ ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది.