విద్యుత్ అధికారులూ...జర ఇటువైపు చూడండి...!

సూర్యాపేట జిల్లా: అనంతగిరి మండల పరిధిలోని గొండ్రియాల గ్రామ శివారులో వారం రోజుల క్రితం రోడ్డుకు ఇరువైపులా మట్టిపోస్తుండగా డోజర్ ఢీ కొని కరెంట్ స్తంభం విరిగి, తీగకు కిందకు వాలి పోవడంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు.దీనితో మోటర్లు నడవక పొలాలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 Electricity Pole Damaged At Gondriyala Village, Electricity Pole , Current Pole-TeluguStop.com

వారం రోజులు అవుతున్నా విద్యుత్ అధికారులు

ఎలాంటి చర్యలు తీసుకోలేదని,తీగలు కిందికి ఉండడంతో తెలియక అటువైపు వెళ్ళే మూగజీవాలు,మనుషులు ప్రమాదం బారినపడే అవకాశం ఉందని స్థానికులు వాపోతున్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని మరమ్మతులు చేయాలని రైతులు, వాహనదారులు కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube