తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు టీడీపీలో అసంతృప్తి జ్వాలలు కొనసాగుతున్నాయి.నిడదవోలు( Nidadavolu ) నియోజకవర్గ టికెట్ ను జనసేనకు కేటాయిస్తారని ప్రచారం జోరుగా సాగుతోంది.
ఈ క్రమంలో టీడీపీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.నియోజకవర్గ స్థానాన్ని శేషారావుకు టికెట్ ( TDP MLA Burugupalli Shesharao )ఇవ్వకుంటే భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని టీడీపీ నేతలు చెబుతున్నారని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే జనసేనకు నిడదవోలు టికెట్ ఇస్తే సహకరించేది లేదని తేల్చి చెప్పారు.దీంతో నియోజకవర్గ టికెట్ టీడీపీ అభ్యర్థికి కేటాయిస్తారా? లేక జనసేనకు ఇస్తారనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.