వైసీపీ ఆవిర్భావం నుంచి కష్టపడిన వ్యక్తి దుట్టా..: ఎంపీ బాలశౌరి

ఉమ్మడి కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో మరోసారి కీలక పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే బాపులపాడులో వైసీపీ నేత దుట్టా రామచంద్రరావును ఎంపీ బాలశౌరి కలిశారు.

అనంతరం ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ వైసీపీ సీనియర్ నేత దుట్టాను తాను మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలిపారు.వైసీపీ ఆవిర్భావం నుంచి కష్టపడిన వ్యక్తి దుట్టా అని చెప్పారు.

వైఎస్ఆర్ కు అత్యంత సన్నిహితుల్లో దుట్టా కూడా ఒకరన్న సంగతి గుర్తు చేశారు.అనంతరం దుట్టా రామచంద్రరావు మాట్లాడుతూ మూడు నెలల క్రితం సీఎం జగన్ ను కలిశానన్నారు.

ఈ క్రమంలో సీఎం జగన్ కు చెప్పిన అభిప్రాయాన్నే బాలశౌరికి చెప్పానని తెలిపారు.అయితే గన్నవరం నియోజకవర్గంలో కీలక నేతగా ఉన్న రామచంద్రయ్య టీడీపీ నుంచి వైసీపీకి వచ్చిన వల్లభనేని వంశీపై కొంత అసంతృప్తిగా ఉన్న సంగతి తెలిసిందే.

Advertisement

ఇటీవల నెక్ట్స్ ఎలక్షన్స్ నేపథ్యంలో గన్నవరం వైసీపీ అభ్యర్థిగా పార్టీ అధిష్టానం వల్లభనేని వంశీనే ప్రకటించింది.ఈ క్రమంలోనే దుట్టాను బుజ్జగించే ప్రయత్నం చేస్తుందని సమాచారం.

ఆ విషయంలో ప్రభాస్, నాని గ్రేట్ అంటున్న అభిమానులు.. అసలేమైందంటే?
Advertisement

తాజా వార్తలు