ఢిల్లీ లిక్కర్ స్కాంపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నాయకురాలు డీకే అరుణ తనదైన శైలిలో స్పందించారు.మీ తప్పులు బయటపడతాయనే బీజేపీపై ఎదురు దాడికి పాల్పడుతున్నారని విమర్శించారు.
కల్వకుంట్ల కుటుంబం సానుభూతి కోసం ప్రయత్నిస్తోందన్నారు.ఏ తప్పూ చేయకపోతే ఈడీ, సీబీఐకి ఎందుకు భయపడుతున్నారని ఆమె ప్రశ్నించారు.
కవిత జైలుకు వెళ్లాల్సి వస్తే ఆమె చేసిన అవినీతి వలనే వెళ్తారని తెలిపారు.ప్రజల కోసం జైలుకు వెళ్లేందుకు సిద్ధం అన్నట్లు మాట్లాడటం విడ్డూరంగా ఉందని డీకే అరుణ ఎద్దేవా చేశారు.