సూపర్ హిట్ మూవీ డీజే టిల్లు మూవీ సీక్వల్ వస్తున్న విషయం తెలిసిందే.డీజే టిల్లు 2 ప్రస్తుతం సెట్స్ మీద ఉంది.
ఈ సీక్వల్ లో నేహా శెట్టి నటించే ఛాన్స్ లేదని తెలుస్తుంది.సిద్ధు జొన్నలగడ్డతో పాటుగా డీజే టిల్లు 2లో మళయాళ భామ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది.
విమల్ కృష్ణ డైరెక్ట్ చేసిన డీజే టిల్లు సినిమా సీక్వల్ కి మాత్రం అతని బదులుగా మల్లిక్ రామ్ ని తీసుకున్నారు.
ఫస్ట్ లో క్లాస్ ఇమేజ్ తో మెప్పించిన అనుపమ ఈమధ్య తన రూట్ మార్చేసింది.
రౌడీ బోయ్స్ కోసం అనుపమ కొత్త కుర్రాడితో లిప్ లాక్ కూడా ఇచ్చేసింది.ఇక ఇప్పుడు డీజే టిల్లు కోసం కూడా అమ్మడు రెడీ అవుతుంది.
డీజే టిల్లు 2లో సిద్ధుతో అనుపమ రొమాంటిక్ సీన్స్ బాగా ఉంటాయట.అనుపమ ఈ సినిమా కోసం కూడా లిప్ లాక్ కి రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది.
డీజే టిల్లు 2లో అనుపమ హైలెట్ అవుతుందని అంటున్నారు.సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ లో వస్తున్న ఈ డీజే టిల్లు 2 సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.