కాకినాడ: కాకినాడలో డిజే టిల్లు మూవీ హీరోయిన్ నేహా శెట్టి సందడి చేసారు.సినిమా లోని పాటకు చిందేశారు.
స్థానిక టూటౌన్ పోలీస్టేషన్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీవత్స షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ఆమె ముఖ్యఅతిథిగా విచ్చేసారు.శ్రీవత్స షాపింగ్ మాల్ ప్రొప్రయిటర్ సందీప్ ఆధ్వర్యంలో శ్రీవత్స షాపింగ్ మాల్ ఏర్పాటు చేశారు.
హీరోయిన్ నేహాశెట్టి జ్యోతి ప్రజ్వలన షోరూమ్ ను ప్రారంభించారు.మగువలు మెచ్చే వివిధ రకాల చీరలను డ్రెస్ మెటీరియల్స్ ను ఆమె పరిశీలించారు.
ఈ సందర్భంగా హీరోయిన్ నేహా శెట్టి మాట్లాడుతూ కాకినాడ వంటి నగరంలో మహిళా మణుల కోసం ప్రత్యేకంగా శ్రీ వత్స షోరూం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
పట్టు చీరలు ఎంతో బాగున్నాయని మహిళల మనసు దోచే విధంగా పలు రకాల పట్టు, ఫ్యాన్సీ, చీరలు తనను ఎంతో ఆకట్టుకున్నాయన్నారు.
తనకు చిన్నప్పుడు వెస్ట్రన్ డ్రెస్సులు అంటే ఎంతో ఇష్టమని ప్రస్తుతం మాత్రం మన భారత సంస్కృతి అద్దం పట్టేలా మహిళలు చీరలు ధరించడం పై మక్కువ చూపించడం శుభపరిణామన్నారు నేహాశెట్టి.శ్రీవత్స షో రూమ్ లో మగువలకు ఇష్టమైన అన్ని రకాల చీరలు అందరికీ అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
ఇక ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు చేస్తున్నానని త్వరలో విడుదల కానున్నాయనీ, వెబ్ సిరీస్ లో అవకాశం వస్తే కచ్చితంగా నటిస్తానని తెలిపారు.
టాలీవుడ్ లో అందరు హీరోలు తనకు ఇష్టమే అని ప్రత్యేకంగా డ్రీమ్ రోల్ అంటూ ఏదీ లేదని అన్నారామే.
అనంతరం షోరూం రీజినల్ మేనేజర్లు పాలని నవీన్ కుమార్, బొమ్మిడి పవన్ కుమార్ మాట్లాడుతూ కాకినాడ నగరంలో మొట్టమొదటిగా సారిగా శ్రీవత్స షోరూం ఏర్పాటు చేశామని తెలిపారు.మగువల మనసు దోచుకునే విధంగా కంచి,ఆరణి, ధర్మవరం పోచంపల్లి పట్టు చీరలు తమ షోరూమ్ లో లభిస్తాయని చెప్పారు.
రానున్న పండుగలు.పెళ్లిళ్ల సీజన్ లో శ్రీ వత్స వన్ స్టాప్ షాప్ గా కస్టమర్లను తప్పకుండా ఆకట్టుకుటుందన్నారు.
పట్టు చీరలు తో పాటు డిజైనరీ శారీస్, ఫ్యాన్సీ సారీస్, లెహంగాస్ అందుబాటులో ఉన్నాయన్నారు.అందరికీ అందుబాటు ధరల్లో చీరలు లభిస్తాయని ఈ అవకాశాన్ని మహిళా మణులు సద్వినియోగం వారు కోరారు.
ఈ కార్యక్రమంలో రీజనల్ మేనేజర్స్ పి నవీన్ కుమార్,పవన్ కుమార్ షోరూమ్ సిబ్బంది పాల్గొన్నారు.