రాజన్న సిరిసిల్ల జిల్లా : గ్రామీణ యువత క్రీడల్లో మరింత రాణించాలని చందుర్తి ఎంపిటిసి పులి రేణుక సత్యం అన్నారు, చందుర్తి మండల కేంద్రంలోని THUGS Tem క్రికెట్ క్రీడాకారులకు క్రీడా దుస్తులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎంపీటీసీ పులి రేణుక సత్యం మాట్లాడుతూ
గ్రామీణ యువత, క్రీడాకారులు వేసవికాలంలో చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ క్రీడల పై దృష్టి సారించాలన్నారు.
రానున్నరోజు లో కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి పెద్దపీట వేసిందన్నారు.ఈ కార్యక్రమంలో క్రీడాకారులు యాకోబ్, సుభాష్, సందీప్, మహేష్, మోసిన్, నరేష్, గంగాధర్, సాయి, దిలీప్, విజయ్, డిషి, రజినీకాంత్, మనితేజ, సంతు,తదితరులు పాల్గొన్నారు.