Minister Peddireddy Ramachandra Reddy : ఎన్నికల వేళ అసంతృప్తులు సహజం..: మంత్రి పెద్దిరెడ్డి

ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల్లో అసంతృప్తులు సహాజమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి( Minister Peddireddy Ramachandra Reddy ) అన్నారు.

సరైన పనితీరు కనబరచని ఎమ్మెల్యేలకు పార్టీ టికెట్ నిరాకరించిందని తెలిపారు.

గెలిచే వారికే టికెట్ ఇవ్వాలనే పార్టీ ఆలోచన అని పేర్కొన్నారు.అయితే వైసీపీ( YCP ) అధిష్టానం పార్టీలో పలు స్థానాల్లో ఇంఛార్జులను మారుస్తున్న నేపథ్యంలో పలువురు నేతలు తీవ్ర అసంతృప్తిలో ఉన్న సంగతి తెలిసిందే.

మరోవైపు ఏపీలోని ప్రతిపక్ష పార్టీలపై మంత్రి పెద్దిరెడ్డి విమర్శలు చేశారు.రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే చనిపోయిందని వెల్లడించారు.టీడీపీ అధినేత చంద్రబాబు,( Chandrababu ) జనసేనాని మరియు కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా వైఎస్ జగన్ ను( YS Jagan ) ఏం చేయలేరన్నారు.

ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో వైసీపీదే గెలుపని స్పష్టం చేశారు.

Advertisement
ఆయన మరణ వార్త చదువుతూ ఏడ్చేసిన యాంకర్..

తాజా వార్తలు