టాలీవుడ్ పాన్ ఇండియా హీరో రామ్ చరణ్( Ram Charan ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.రామ్ చరణ్ ప్రస్తుతం వరుసగా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే గత ఏడాది ఆర్ఆర్ఆర్ సినిమాతో( RRR ) ప్రేక్షకులను పలకరించిన రామ్ చరణ్, ఈ సినిమాతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.ఇకపోతే రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ ఛేంజర్( Game Changer ) సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.
ఇందులో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.ఆ సంగతి పక్కన పెడితే ఇటీవలే రామ్ చరణ్ తండ్రి అయిన సంగతి మనందరికీ తెలిసిందే.
ప్రస్తుతం తన లిటిల్ ప్రిన్సెస్ తో సమయాన్ని గడుపుతూ కొద్ది రోజులపాటు సినిమాలకు బ్రేక్ తీసుకున్నాడు.అయితే ఉపాసనకు డెలివరి డేట్ దగ్గర పడినప్పటి నుంచి తనని జాగ్రత్తగా చూసుకుంటూ సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు.
ఇకపోతే చెర్రీ సినిమాల విషయానికొస్తే రామ్ చరణ్ ప్రస్తుతం నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమాను ఈ ఏడాది చివరిలో విడుదల చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.
అయితే ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ డైరెక్టర్ బుచ్చిబాబు సనా తో( Buchhi Babu ) ఒక సినిమాను చేయబోతున్నట్టు తెలుస్తోంది.ఇప్పటికే ఆ ప్రాజెక్టుని కన్ఫామ్ చేసేసారట చెర్రీ.పాన్ ఇండియా లెవెల్లో స్పోర్ట్స్ డ్రామాగా ఆ సినిమా రూపొందనున్నట్లు తెలుస్తోంది.
అందులో హీరోయిన్ గా మృణాక్ ఠాకూర్ ను తీసుకోవాలని చూస్తున్నారట మూవీ మేకర్స్.ఆ తర్వాత రామ్ చరణ్ లోకేష్ కనకరాజ్, ప్రశాంత్ నీల్ వంటి దర్శకులతోనూ చెర్రీ వర్క్ చేయబోతున్నాడని సమాచారం.
ఇదిలా ఉంటే చరణ్, శంకర్ కాంబోలో మరో మూవీ రాబోతుందనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
కాగా శంకర్( Director Shankar ) డైరెక్టర్గా కెరీర్ స్టార్ట్ చేసి 30 ఏళ్ళు అవుతోంది.ఆయన రూపొందించిన మొదటి చిత్రం జెంటిల్మెన్ 1993 జూలై 30 విడుదలైంది.ఈ సందర్భంగా పలువురు కోలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు.
తన టీంతో కలిసి కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు శంకర్.చరణ్ కూడా ఆయనకు విషెస్ తెలియజేస్తూ ట్వీట్ చేశాడు.
శంకర్ థ్యాంక్స్ చెబుతూ.ఆగస్టులో మన నెక్స్ట్ మూవ్ కొరకు వెయిట్ చేస్తున్నాను అంటూ రీ ట్వీట్ చేశారు.
ఈ మూవ్ అనే పదాన్ని కాస్తా మూవీగా తీసుకుని మరో సినిమా చేయబోతున్నారంటూ పోస్ట్ కనిపించడంతో ఈ వార్త చక్కర్లు కొడుతోంది.ఈ విషయంపై చెర్రీ శంకర్లు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.