తెలుగు సినీ ప్రేక్షకులకు నటుడు షాయాజీ షిండే గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు షాయాజీ షిండే.
ఎక్కువగా విలన్ పాత్రలో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.తెలుగులో సీమ టపాకాయ్, యముడికి మొగుడు, సుడిగాడు, అరుంధతి ఇలా ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు షాయాజీ షిండే.
ఇది ఇలా ఉంటే తాజాగా ఈయనకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
తాజాగా షాయాజీ షిండే పై మరాఠీ చిత్ర నిర్మాత సచిన్ ససన్ తీవ్రమైన ఆరోపణలు చేశారు.
సినిమా నుంచి తప్పుకుని తనను మోసం చేశారు అంటూ ఆయన ఆరోపించారు.అయితే మరాఠీ చిత్రనిర్మాత సచిన్ ససన్ తెరకెక్కిస్తున్న గిన్నాద్ సినిమాలో నటించేందుకు రూ.5 లక్షలకు షాయాజి షిండే సంతకం చేసి నిర్మాత నుంచి డబ్బులు కూడా తీసుకున్నారు.నవంబర్ 25, 26 తేదీల్లో షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా షాయాజి షిండే అందుబాటులో లేరని నిర్మాత అన్నారట.
ఆ తర్వాత 27న షూటింగ్ రోజు స్క్రిప్ట్ మార్చమని షాయాజీ కోరడంతో ఆశ్చర్యపోయానని చిత్ర నిర్మాత వెల్లడించారు.
నిర్మాత అందుకు ఒప్పుకోకపోవడంతో ఆగ్రహించిన షాయాజి సినిమా నుంచి తప్పుకున్నారట.షూటింగ్ ఆగిపోవడంతో చిత్రనిర్మాత సచిన్ తన ఫీజును తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలగినందుకు పారితోషికం రూ.5 లక్షలతో పాటు అన్ని ఖర్చులు భరించి మొత్తం రూ.17 లక్షలు చెల్లించాలని నిర్మాత కోరారు.మరి ఈ వార్త పై షాయాజీ షిండే ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.తను తీసుకున్న 5 లక్షల లను తిరిగి ఇస్తాడా లేకపోతే నిర్మాతలు డిమాండ్ చేసినట్టుగా 17 లక్షల రూపాయలను చెల్లిస్తారా చూడాలి మరి.