ఒక సినిమా హిట్ అయితే ఆ డైరెక్టర్ కు ఎంత పేరు వస్తుందో.ప్లాప్ అయితే ఆ డైరెక్టర్ మళ్ళీ సినిమా చేయడానికి అంతే సమయం పడుతుంది.
ఈ పోటీ ప్రపంచంలో సక్సెస్ ఎక్కడ ఉంటే అక్కడికే వెళ్లేందుకు ఇష్టపడతారు.మరి ఒక డైరెక్టర్ కు అట్టర్ ప్లాప్ వస్తే ఇక అతడిని హీరో ఫ్యాన్స్ ఏకిపారేస్తున్న రోజులివి.
అలా హీరో ఫ్యాన్స్ చేత ట్రోల్స్ చేయించుకున్న డైరెక్టర్ రాధాకృష్ణ.
ఈయన ప్రభాస్ తో రాధేశ్యామ్ సినిమాను తీసాడు.
ఈ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యి భారీ డిజాస్టర్ గా మిగిలి పోయింది.ఇక అప్పటి నుండి ఈ డైరెక్టర్ కనుమరుగయ్యారు.
నెక్స్ట్ చేయబోయే సినిమాల అప్డేట్ గురించి కూడా చెప్పలేదు.కానీ తాజాగా సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.
ప్రెజెంట్ ఇండియన్ సినిమా దగ్గర ఆర్ఆర్ఆర్ గురించి చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే.
రౌద్రం రణం రుధిరం సినిమాను అగ్ర డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేసాడు.ఈ సినిమా గత ఏడాది మర్చి 25న రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్ గా సంచలన విజయాన్ని నమోదు చేసింది.నాటు నాటు సాంగ్ ప్రపంచ ప్రతిష్టాత్మక పురస్కారం ఆస్కార్ కు నామినేట్ కావడంతో సినీ ప్రముఖులు అభినందనలు చెబుతున్నారు.
ఇక తాజాగా డైరెక్టర్ రాధాకృష్ణ కూడా ఈ విషయం గురించి స్పందిస్తూ పోస్ట్ చేసాడు.
”కొంతమంది వ్యక్తులు మానవులకు సాధ్యం కానీ.సుదూర ప్రాంతాలకు రాణిస్తారు.అలాగే వారు ఇతరులకు కూడా మార్గం చూపిస్తారు.
ఎస్ ఎస్ రాజమౌళి, కీరవాణి, చంద్రబోస్ అలాంటి వారు అంటూ ఈయన చేసిన ఈ పోస్ట్ పలువురి సృష్టిని ఆకర్షిస్తుంది.ఇక డైరెక్టర్ రాధాకృష్ణ సినిమాల విషయానికి వస్తే.
ఈయన నెక్స్ట్ ఎవరితో సినిమా చేస్తాడో అనేది చూడాలి.ఇంత వరకు అయితే ఎలాంటి ప్రకటన రాలేదు.
చూడాలి ఎప్పుడు అప్డేట్ వస్తుందో.