టాలీవుడ్ ఇండస్ట్రీలోని పాపులర్ కమెడియన్లలో ఒకరైన పృథ్వీరాజ్ వరుస సినిమా ఆఫర్లతో బిజీ అవుతూ కెరీర్ ను కొనసాగిస్తున్నారనే సంగతి తెలిసిందే.గత ఎన్నికల్లో వైసీపీ తరపున ప్రచారం చేసిన పృథ్వీరాజ్ ఆ శ్రమకు ప్రతిఫలంగా పదవిని పొందాడు.
అయితే ఒక వివాదంలో చిక్కుకోవడంతో పృథ్వీరాజ్ కు పదవి దూరం కావడంతో పాటు పార్టీకి కూడా దూరం కావాల్సి వచ్చింది.తాజాగా ఒక న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పృథ్వీరాజ్ వైసీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
అయితే పృథ్వీరాజ్ చేసిన వ్యాఖ్యలను వైసీపీ నేతలు పట్టించుకోకపోయినా దర్శకుడు గీతాకృష్ణ మాత్రం ఆ వ్యాఖ్యల గురించి షాకింగ్ కౌంటర్ ఇచ్చారు.సినిమాల్లో కమెడియన్ గా గుర్తింపును తెచ్చుకున్న పృథ్వీరాజ్ కు తక్కువ సమయంలోనే రాజకీయాల్లో ఛాన్స్ దక్కిందని ఆయన తెలిపారు.
ఈ గుర్తింపు పృథ్వీరాజ్ కు కాపు కులానికి చెందిన వ్యక్తి కావడం వల్ల దక్కిన గుర్తింపు కావచ్చని ఆయన చెప్పుకొచ్చారు.
మెగా హీరోలను అప్పట్లో తిట్టడం ఆయనకు ప్లస్ అయ్యి ఉండవచ్చని గీతాకృష్ణ అభిప్రాయపడ్డారు.
అలా చేయడంతో ఆయనకు టీటీడీ ఛానల్ ఛైర్మన్ గా గుర్తింపు దక్కిందని గీతాకృష్ణ కామెంట్లు చేశారు.రాజకీయాలలో ఎదగాలని భావించే వాళ్లకు బలహీనతలు ఉండకూడదని అమ్మాయి ఫోన్ చేసిన వెంటనే సొల్లు కార్చుకునే వాళ్లు పాలిటిక్స్ కు ఏ విధంగా సెట్ అవుతారని గీతాకృష్ణ అభిప్రాయపడ్డారు.
పృథ్వీరాజ్ కు బలహీనతలు ఉండి కుట్ర జరిగిందని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని గీతాకృష్ణ కామెంట్లు చేశారు.పృథ్వీరాజ్ వైసీపీని తిట్టడం వల్ల ఆయనకు మూవీ ఆఫర్లు వచ్చినా వ్యక్తిగా ఎవరూ నమ్మరని గీతాకృష్ణ చెప్పుకొచ్చారు.పృథ్వీ తన గురించి తాను ఎక్కువగా ఊహించుకుంటున్నాడని గీతాకృష్ణ పేర్కొన్నారు.గీతాకృష్ణ చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.