టాలీవుడ్ లో ఇప్పుడు ఉన్న స్టార్ నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు.ఈయన ప్రొడ్యూసర్ గా మంచి విజయం సాధించాడు.
ఈయన చేసే ప్రతీ సినిమా తన లెక్కల ప్రకారం బడ్జెట్ వేస్తూ ఎక్కడ లెక్క తప్పకుండ పక్కా ప్లాన్ తో బరిలోకి దిగుతాడు.ప్రెజెంట్ దిల్ రాజు భారీ బడ్జెట్ సినిమాలను నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
ఇక ఈ సినిమాల్లో తన మొదటి తమిళ్ సినిమా వారసుడు కూడా ఉంది.వారసుడు సినిమాతో దిల్ రాజు కోలీవుడ్ లోకి ప్రొడ్యూసర్ గా పరిచయం కాబోతున్నాడు.
టాలెంటెడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి కాంబోలో ‘వారసుడు’ సినిమా తెరకెక్కుతుంది.దిల్ రాజు భారీ స్థాయిలో పాన్ ఇండియా సినిమాగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.అయితే తెలుగు వర్షన్ మాత్రం ఆలస్యంగా రిలీజ్ కానుంది.కొన్ని టెక్నీకల్ కారణాల వల్ల ఈ సినిమా తెలుగు వర్షన్ మాత్రం జనవరి 14న రిలీజ్ చేయనున్నట్టు ఈ రోజు ఉదయం ప్రెస్ మీట్ లో ప్రకటించారు.ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ.
కేవలం తెలుగు సినిమాలైన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలకు తొలి ప్రాధాన్యం ఇచ్చేందుకే వారసుడు సినిమాను వాయిదా వేస్తున్నట్టు వెల్లడించారు.వారసుడితో పోలిస్తే తెలుగు రెండు పెద్ద సినిమాలకు ఎక్కువ స్క్రీన్స్ వస్తాయని ఆయన వెల్లడించారు.అయితే వారసుడు మాత్రం ఎన్ని స్క్రీన్స్ లో రిలీజ్ అవుతుందో వెల్లడించలేదు.చూడాలి ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో.