టాలీవుడ్ లో ఇప్పుడు ఉన్న స్టార్ నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు.ఈయన ప్రొడ్యూసర్ గా మంచి విజయం సాధించాడు.
ఈయన చేసే ప్రతీ సినిమా తన లెక్కల ప్రకారం బడ్జెట్ వేస్తూ ఎక్కడ లెక్క తప్పకుండ పక్కా ప్లాన్ తో బరిలోకి దిగుతాడు.ఈయన బడ్జెట్ విషయంలో ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తూ ఉంటాడు.
ముందు నుండి ఈయన చిన్న చిన్న సినిమాలతో పాటు మీడియం రేంజ్ సినిమాలను మాత్రమే చేసుకుంటూ వచ్చాడు.
అయితే ఈ మధ్య మన టాలీవుడ్ మార్కెట్ విస్తరించడంతో అంతా పాన్ ఇండియా జపం మొదలు పెట్టారు.
దీంతో దిల్ రాజు కూడా చిన్న సినిమాలతో పాటు పాన్ ఇండియా సినిమాలను కూడా తెరకెక్కించాల్సి వస్తుంది.ఈ క్రమంలోనే దిల్ రాజు భారీ బడ్జెట్ లతో పాన్ ఇండియా తెరకెక్కిస్తున్నాడు.
ఇక ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన ”వారసుడు” వంటి హై బడ్జెట్ సినిమాను నిర్మించాడు.
ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకున్న విజయ్ స్టామినాతో బాగానే కలెక్షన్స్ సాధిస్తున్నాడు.ఇక ఈ సినిమా తర్వాత దిల్ రాజు మరో హై బడ్జెట్ సినిమాను నిర్మిస్తున్నారు. రామ్ చరణ్, శంకర్ కలయికలో రాబోతున్న ఆర్సీ15 సినిమాను దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.
ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇక దిల్ రాజు తన తర్వాత సినిమా కూడా ఎవరితో ఉండబోతుందో ప్రకటించారు.దీంతో ఇప్పుడు ఈ విషయం నెట్టింట మరింత ఆసక్తిగా మారింది.తాజాగా ఒక ఇంటర్వ్యూలో దిల్ రాజు తన నెక్స్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గురించి వివరించాడు.
దిల్ రాజు తన నెక్స్ట్ సినిమాను కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో చేయనున్నట్టు తెలిపాడు.అలాగే ఈ సినిమాకు రావణం అనే టైటిల్ ను కూడా పెట్టినట్టు కన్ఫర్మ్ చేసేసాడు.
తమ బ్యానర్ లో ఇది అత్యంత భారీ ప్రాజెక్ట్ అని ఎంతో గ్రాండ్ గా భారీ స్థాయి విజువల్స్ తో తెలిపారు.ఈ సినిమా పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని తెలిపాడు.