ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మైలవరం గడ్డ మళ్లీ వైసీపీ దే.త్రిమూర్తుల కలయికతో విజయం నల్లేరు మీద నడకే.
విభేదాలు ఉమా సృష్టించిన అపోహలే.జగన్ జన్మదిన వేడుకల్లో వసంతం కృష్ణ ప్రసాద్ త్రిమూర్తులైన వసంత- జోగి- తలసిల కలిసి మళ్లీ మైలవరంలో వైసిపి జండా ఎగరేస్తామని, వైసీపీ విజయం నల్లేరు మీద నడికే నని ధీమా వ్యక్తం చేశారు మైలవరం నియోజకవర్గ శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్.
తమ మధ్య విభేదాలు అంటూ ఉమా సృష్టించిన అపోహలేని, కలిసికట్టుతో మైలవరంలో ఉమాను ఓడించి మైలవరని బహుమతిగా ఇచ్చి జగన్ ను మళ్లీ ముఖ్యమంత్రి చేస్తామని తెలిపారు.
బుధవారం నాడు ఇబ్రహీంపట్నంలో జగన్ జన్మదినం సందర్భంగా వేడుకలు నిర్వహించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు మైలవరం నియోజకవర్గ శాసనసభ్యులు వసంతం కృష్ణ ప్రసాద్.
మీడియాతో మాట్లాడుతూ ఉమా పై నిప్పులు జరిగారు వసంత.ఈ కార్యక్రమంలో జోగి రాము మరియు జోగి వర్గీయులు సైతం హడావుడి చేయడంతో విభేదాల అపోహలు పటాపంచలు అయినట్లేనని కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.