బుల్లితెర కామెడీ షోలలో ఒకటైన జబర్దస్త్ షో ఎంతోమంది కమెడియన్లకు లైఫ్ ఇచ్చింది.అనసూయ, రష్మీలకు ఈ షో ద్వారా స్టార్ యాంకర్లుగా గుర్తింపు దక్కింది.
ఎంతోమంది కమెడియన్లు ఈ షో ద్వారా ప్రేక్షకులకు పరిచయమై ఉన్నత స్థానాలకు చేరుకున్నారు.అయితే గత కొన్నిరోజులుగా ఈ షో కళ తప్పుతోంది.
జబర్దస్త్ కమెడియన్లు వరుసగా ఈ షోకు గుడ్ బై చెబుతూ ఈ షో చూస్తున్న ప్రేక్షకులకు, జబర్దస్త్ అభిమానులకు షాకిస్తున్నారు.
తాజాగా అనసూయ జబర్దస్త్ కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే.
నాగబాబు ఇచ్చిన భరోసా వల్లే అనసూయ ఈ షోకు గుడ్ బై చెప్పిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.స్టార్ మా ఛానెల్ లోకి ఎంట్రీ ఇచ్చినందుకు భారీ మొత్తంలో అనసూయకు పారితోషికం దక్కిందని సమాచారం అందుతోంది.
జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన వాళ్లకు ఆ షో నుంచి దూరమైన జడ్జి భారీ ఆఫర్లను ఇప్పించడంతో పాటు పర్సనల్ గిఫ్ట్స్ ఇస్తున్నారని సమాచారం.
అనసూయ, ఇతర జబర్దస్త్ కమెడియన్లు జబర్దస్త్ ను వీడటం గురించి స్పందించి క్లారిటీ ఇస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
జబర్దస్త్ షోకు దూరమైన కమెడియన్లు భవిష్యత్తులో ఈ షోలోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు అయితే ఉండవని సమాచారం అందుతోంది.ఎంతోమంది కమెడియన్ల కెరీర్ ను మలుపుతిప్పిన షోకు ఈ పరిస్థితి రావడంతో నెటిజన్లు సైతం ఆశ్చర్యపోతున్నారు.

జబర్దస్త్ షో రేటింగ్స్ కూడా క్రమంగా తగ్గుతుండటం గమనార్హం.ఈటీవీలో ప్రసారమయ్యే ప్రోగ్రామ్స్ కు పోటీగా ఇతర ఛానెళ్లలో ప్రసారమయ్యే షోలు ఏ మేరకు సక్సెస్ అవుతాయో చూడాల్సి ఉంది.రష్మీ, హైపర్ ఆది కూడా ఈటీవీ షోలకు గుడ్ బై చెబితే మాత్రం ఈటీవీ ఛానల్ ర్యాంకింగ్ మరింత దారుణంగా ఉండే ఛాన్స్ అయితే ఉంది.







