వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం అమెరికా గడ్డ మీదకు అడుగుపెట్టిన భారతీయులు ప్రస్తుతం అక్కడి వ్యవస్థలను శాసించే స్థాయికి చేరుకుంటున్న సంగతి తెలిసిందే.ప్రత్యేకించి అమెరికన్ కార్పోరేట్ ప్రపంచాన్ని భారతీయులు ఏలుతున్నారు.
సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్, పరాగ్ అగర్వాల్, శంతను నారాయణ్, అరవింద్ కృష్ణ, అజయ్ బంగా, మనీష్ శర్మ, లీనా నాయర్ వంటి భారతీయ ఎగ్జిక్యూటివ్లు అమెరికన్ కంపెనీలకు సీఈవోలుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.ఈ కోవలో డబ్ల్యూపీపీ యాజమాన్యంలోని గ్లోబల్ అడ్వర్టైజింగ్ కంపెనీ Ogilvyకొత్త సీఈవోగా భారత సంతతికి చెందిన దేవికా బుల్చందానీ నియమితులయ్యారు.
పంజాబ్లోని ఆధ్యాత్మిక నగరం అమృత్సర్లో దేవిక జన్మించారు.2020లో Ogilvy లో చేరిన ఆమెనార్త్ అమెరికా గ్లోబల్ ప్రెసిడెంట్ , సీఈవోగా విధులు నిర్వర్తించారు.
Ogilvyలో చేరడానికి ముందు దేవికా.దాదాపు 26 ఏళ్ల పాటు మెక్కాన్ సంస్థలో నార్త్ అమెరికా ప్రెసిడెంట్ సహా వివిధ హోదాల్లో పనిచేశారు.అలాగే మాస్టర్ కార్డ్ కోసం ప్రైస్లెస్, ట్రూ నేమ్ ప్రచారంలో ఆమె కీలక పాత్ర పోషించారు.
ఇక దేవిక ప్రారంభించిన ‘‘ఫియర్లెస్ గర్ల్’’ క్యాంపెయినింగ్కు కేన్స్ లయన్స్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ క్రియేటివిటీ చరిత్రలో అత్యధిక అవార్డులు పొందిన ప్రచార కార్యక్రమాల్లో ఒకటిగా నిలిచింది.