అభివృద్ధి గవర్నర్ కు కనిపించడం లేదా..?: మంత్రి హరీశ్ రావు

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పై మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై బురద జల్లుతున్నారని ఆయన ఆరోపించారు.

ఉస్మానియా ఆస్పత్రిపై గవర్నర్ వ్యాఖ్యలు దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.కోడిగుడ్డుపై ఈకలు పీకినట్లు గవర్నర్ వ్యాఖ్యలు ఉన్నాయంటూ విమర్శించారు.

వైద్యరంగంలో జరుగుతున్న అభివృద్ధి గవర్నర్ కు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై ఆమె ఎందుకు మాట్లాడరని నిలదీశారు.

గవర్నర్ తమ పాలనలో చెడు మాత్రమే చూస్తారా అని ప్రశ్నించిన మంత్రి హరీశ్ రావు బీజేపీ అధికార ప్రతినిధిలా గవర్నర్ కామెంట్స్ చేస్తున్నారని మండిపడ్డారు.

Advertisement
అధ్యక్ష ఎన్నికల వేళ డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ రిలీఫ్.. ఆ కేసు కొట్టివేత

Latest Latest News - Telugu News