తిరుమల( Tirumala ) శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించు కున్నారు.రాష్ట్ర డిప్యూటీ సీఎం నారాయణ స్వామి( Deputy CM Narayana Swamy ), ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, విజయవాడ టీడీపీ ఎంపీ కేసినేని నాని( Kesineni Srinivas ), తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, మ్యాడ్ మూవీ సినిమా సభ్యులు దర్శించుకున్నారు.
విఐపీల విరామం సమయంలో ఆలయం లోకి వెళ్లి మ్రొక్కులు చెల్లించుకోవడం జరిగింది.రంగనాయక మండపం లో వేద పండితులచే వేద ఆశీర్వాదం తో పాటు స్వామి వారి తీర్ధప్రసాదాలను ఇచ్చారు….