ముంబై వేదికగా అట్టహాసంగా మొదలైన డబ్ల్యుపీఎల్ లో( WPL ) ఐదు జట్ల మధ్య జరిగిన పోటీలో ఒక్కో జట్టు ఎనిమిది మ్యాచ్లు ఆడింది.లీగ్ టేబుల్ లో అగ్రస్థానంలో ఉండే ఢిల్లీ క్యాపిటల్స్( Delhi Capitals ) నేరుగా ఫైనల్ కు చేరుకుంది.
ఇక రెండవ స్థానంలో ఉండే ముంబైకు, మూడవ స్థానంలో ఉండే యూపీ కి మధ్య ఎలిమినేటర్ మ్యాచ్( Eliminator Match ) జరగనుంది.టేబుల్ లో చివరి స్థానాలలో నిలిచిన గుజరాత్ జెయింట్స్, బెంగుళూరు రాయల్ చాలెంజర్స్ జట్లు లీగ్ నుండి నిష్క్రమించాయి.
ఈనెల 24న యూపీ- ముంబై ఇండియన్స్ మధ్య జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో విజయం సాధించిన జట్టు, ఈనెల 26న ఢిల్లీ క్యాపిటల్స్ తో టైటిల్ కోసం తలపడుతుంది.ముంబై ఇండియన్స్ మొదటి ఐదు మ్యాచ్లను గెలిచి తర్వాత కాస్త డీలపడి రెండు మ్యాచ్లలో ఓడి, చివరి మ్యాచ్లో బెంగళూరు జట్టుపై గెలిచి రెండో స్థానంలో నిలిచింది.ఢిల్లీ క్యాపిటల్స్ ఆరు మ్యాచ్లలో గెలిచి, రెండు మ్యాచ్లలో ఓడింది.
పాయింట్లు పరంగా ముంబై తో సమానం గా ఉన్నా కూడా రన్ రేట్ అధికంగా ఉండడంతో నేరుగా ఫైనల్ కు చేరింది.ఇక బెంగళూరు జట్టు వరుసగా ఐదు మ్యాచ్లు ఓడి, రెండు మ్యాచ్లలో అద్భుతంగా ప్రదర్శించి చివరి మ్యాచ్ ముంబై చేతిలో ఓడి చివరి నుండి రెండవ స్థానంలో నిలిచింది.ఇక గుజరాత్ జెయింట్స్ జట్టు కూడా ఆరు మ్యాచ్లలో ఓడి, రెండు మ్యాచ్లలో గెలిచి లీగ్ టేబుల్ లో చివరి స్థానంలో నిలిచింది.
ఇక ఫైనల్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడే జట్టు ఏదో.? డబ్ల్యూపీఎల్ 2023 టైటిల్ ఏ జట్టు సొంతం చేసుకుంటుందో చూడాలి.