ఈనెల 21 వ తేదీన అనకాపల్లిలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నట్లు కొణతాల రామకృష్ణ తెలిపారు.కార్యకర్తలతో సమావేశం అనంతరం తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని పేర్కొన్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో స్టీల్ ప్లాంట్, పోలవరం, సుజల స్రవంతి, ఉత్తరాంధ్ర అభివృద్ధి అంశాలపై చర్చించానని తెలిపారు.ఈ క్రమంలోనే తాను ఏ పార్టీలో చేరేది త్వరలోనే ప్రకటిస్తానని వెల్లడించారు.
అదేవిధంగా పోటీపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.