ఏపీలో పాలనా వికేంద్రీకరణ జరగాలని మంత్రి రోజా అన్నారు.దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆమె దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ వికేంద్రీకరణ జరగాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు.ఈ క్రమంలో 108 టెంకాయలను కొట్టాను అన్న మంత్రి రోజా.
వికేంద్రీకరణ జరిగిన తర్వాత మళ్లీ దేవాలయానికి వస్తానని చెప్పారు.వికేంద్రీకరణకు ఉన్న న్యాయపరమైన చిక్కులన్నీ వీడాలని, మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలని పేర్కొన్నారు.