సూర్యాపేట జిల్లా:రాష్ట్ర ప్రభుత్వం రేషన్ డీలర్ల( Ration Dealers ) సమస్యలు6 పరిష్కరించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ గురువారం కోదాడ పట్టణంలోని రంగా థియేటర్ సెంటర్ లో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఅర్,జగదీష్ రెడ్డి,ఏమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఫ్లెక్సీలకు రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు.
అనంతరం రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం డివిజన్ అధ్యక్షులు కనమర్లపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ రేషన్ డీలర్ల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
ప్రభుత్వం క్వింటకు 70 రూపాయలు నుండి 140 రూపాయల కమిషన్ పెంచడం,5 లక్షల ఆరోగ్య బీమా( Health insurance )తో పాటు లైసెన్స్ రెన్యూయల్ సమయాన్ని 2 సంవత్సరాల నుండి 5 సంవత్సరాలకు చెయ్యడం పట్ల డీలర్లు అందరూ సంతోషం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు తీగల అశోక్ కుమార్, గొల్లపూడి శ్రీనివాస్,పట్టణ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షులు యాదా కళ్యాణి,ప్రధాన కార్యదర్శి కాంపాటి సునీత, కోశాధికారి మెంటా సత్యవతి,సహా కార్యదర్శి నేరెళ్ల ఉష,వివిధ మండలాలకు చెందిన డీలర్స్ పాల్గొన్నారు.