ఫోన్ ట్యాపింగ్ కేసులో( Phone Tapping Case ) పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో కేసులో తాజాగా కొత్త పేరు తెరపైకి వచ్చింది.
ఎస్ఐబీలో సుదీర్ఘ కాలం పనిచేసిన దయానంద రెడ్డి( Dayananda Reddy ) పేరు బయటకు వచ్చింది.కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు( SIB Ex Chief Prabhakar Rao ) దయానంద రెడ్డి అత్యంత నమ్మకస్తుడిగా ఉన్నారు.
కాగా ఎస్ఐబీలో దయానంద రెడ్డి ఓఎస్డీగా విధులు నిర్వర్తించారు.ఈ క్రమంలో పోలీసులు ఆయనను విచారించాలని యోచనలో ఉన్నారని తెలుస్తోంది.మరోవైపు అమెరికా నుంచి హైదరాబాద్ కు వస్తున్న ప్రభాకర్ రావును ఇవాళ పోలీసులు విచారించే అవకాశం ఉంది.