ఢిల్లీలో స్టోరీ ఫర్ గ్లోరీ గ్రాండ్ ఫినాలే ముగిసింది.వీడియో, ప్రింట్ అనే రెండు కేటగిరీల కింద 12 మంది విజేతలను ఎంపిక చేయడంతో దేశ వ్యాప్తంగా నిర్వహించిన టాలెంట్ హంట్ ముగిసింది.
మేలో ప్రారంభమైన ఈ కార్యక్రమం నాలుగు నెలల వ్యవధిలో వెయ్యికి పైగా దరఖాస్తులను అందుకుంది.కాగా, ఇండియా ప్రముఖ కంటెంట్ ప్లాట్ఫామ్ డైలీ హంట్, ఏఎంజీ మీడియా నెట్వర్క్ లిమిటెడ్ తో పాటు ప్రముఖ ఇంటిగ్రేటెడ్ వ్యాపార సమ్మేళనం అదానీ గ్రూప్ సహకారంతో ఈ స్టోరీ ఫర్ గ్లోరీను ప్రారంభించారు.
ముందుగా దరఖాస్తుల్లో 20 మంది ప్రతిభావంతులైన వారిని ఎంపిక చేశారు.షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులు ప్రముఖ మీడియా సంస్థ ఎమ్ఐసీఏలో ఎనిమిది వారాల పాటు ఫెలోషిప్, రెండు వారాల పాటు ప్రోగ్రామ్స్ కు సంబంధించిన శిక్షణ పొందారు.
ట్రైనింగ్ పూర్తైన తర్వాత ఆరు వారాలు తమ చివరి ప్రాజెక్టులో పని చేశారు.అదే సమయంలో వారికి ప్రముఖ మీడియా పబ్లిషింగ్ సంస్థలు మార్గదర్శకత్వం చేశాయి.నైపుణ్యాన్ని పెంపొందించుకోవడంతో పాటు కంటెంట్ కఠినతను పెంచుకోవడానికి దృష్టి సారించిన ఫైనలిస్ట్ అభ్యర్థులు.తమ ప్రాజెక్టులను సమర్పించారు.
వారిలో 12 మందిని జ్యూరీ విజేతలుగా ఎంపిక చేసింది.జ్యూరీలో డైలీహంట్ వ్యవస్థాపకుడు వీరేంద్ర గుప్తా వంటి ప్రముఖులు సైతం ఉన్నారు.సంజయ్ పుగాలియా, సీఈవో మరియు ఎడిటర్ ఇన్ చీఫ్, ఏఎంజీ మీడియా నెట్ వర్క్స్ లిమిటెడ్., అనంత్ గోయెంకా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ది ఇండియన్ ఎక్స్ ప్రెస్.
, అనుపమ చోప్రా, ఫౌండర్, ఫిల్మ్ కంపానియన్., శైలి చోప్రా, షీ ద పిపుల్ స్థాపకుడు ., గావ్ కనెక్షన్ వ్యవస్థాపకుడు నీలేష్ మిశ్రా, ఫ్యాక్టర్ డైలీ సహ వ్యవస్థాపకుడు పంకజ్ మిశ్రాలు ఉన్నారు.
స్టోరీ ఫర్ గ్లోరీ.
ప్రత్యేకమైన జర్నలిజం రంగంలో వారి టాలెంట్ ను నిరూపించుకోవడానికి, సృజనాత్మకమైన కథనంతో పెద్ద మీడియా పర్యావరణ వ్యవస్థను రూపొందించడానికి అవకాశాన్ని అందించింది.భారత దేశం యొక్క శక్తివంతమైన, ప్రతిభావంతులైన కథకుల సమూహాన్ని కనుగొనడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు.
ఇటు డిజిటల్ వార్తలు, మీడియా విస్తరణ గణనీయంగా పురోగమిస్తోంది.ముఖ్యంగా కథ చెప్పే కళలో స్టోరీ ఫర్ గ్లోరీ చొరవతో భారతదేశాన్ని రూపొందించడంలో నిబద్ధతను పునరుద్ధరిస్తున్నారు.
మీడియా ఎకోసిస్టమ్, వర్ధమాన కథకులు తమ నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి, అదేవిధంగా వారి అభిరుచిని ప్రపంచంతో పంచుకోవడానికి అవకాశాలను అందించారని డైలీహంట్ వ్యవస్థాపకులు వీరేంద్ర గుప్తా తెలిపారు.
వైవిధ్య భరితమైన కథల నేలగా భారతదేశం అనేక మంది కథకులకు నిలయం.
అయితే డైలీహంట్ తో కలిసి భారత దేశ చరిత్రకారుల తరువాతి తరంను గుర్తించగలిగారు.వారి నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి అవసరమైన మద్ధతుతో పాటు వేదికను అందించగలిగాం.
ఒక్క మాటలో చెప్పాలంటే మాకు వచ్చిన స్పందన చాలా గొప్పది.స్టోరీ ఫర్ గ్లోరీ చూపించిన చొరవ మంచి కథనాన్ని అందించడంలో నిరంతర నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.
దాంతో పాటు దేశంలోని అత్యంత ప్రతిభావంతులైన రైటర్లకు, వారి సృజనాత్మకను బయటకు తీసేందుకు చూపించాల్సిన మార్గాలను అందించడానికి అన్వేషిస్తుందని AMG మీడియా నెట్వర్క్స్ లిమిటెడ్, అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ యొక్క అనుబంధ సంస్థ సీఈవో, ఎడిటర్-ఇన్-చీఫ్ సంజయ్ పుగాలియా అన్నారు.
స్టోరీ ఫర్ గ్లోరీ అనేది వీడియో, కరెంట్ అఫైర్స్, న్యూస్, సైన్స్, టెక్నాలజీ, ఆర్ట్స్, కల్చర్ వంటి అంశాలలో భారతదేశం గొప్పతనం, విభిన్నమైన కంటెంట్ సృష్టికర్తలను కనుగొనే లక్ష్యంతో ప్రారంభించబడింది.
డైలీ హంట్ భారతదేశంలోని నెంబర్ వన్ స్థానిక భాషా కంటెంట్ ఫ్లాట్ ఫామ్.ప్రతి రోజు 15 భాషల్లో ఒక మిలియన్ కొత్త కంటెంట్ లను అందిస్తోంది.
డైలీహంట్ లోని కంటెంట్ లైసెన్స్ పొందింది.అదేవిధంగా 50 వేలకు పైగా ఎక్కువ కంటెంట్ భాగస్వాములు, 50 వేలకు పైగా క్రియేటర్లతో క్రియేటర్ ఎకోసిస్టమ్ నుండి పొందబడింది.
స్టోరీ ఫర్ గ్లోరీ లక్ష్యం ఇండిక్ ఫ్లాట్ ఫామ్ అనేది బిలియన్ భారతీయులకు తెలియజెప్పడం, వినోదాన్ని అందించే కంటెంట్లను కనుగొనడం, వినియోగించడంతో పాటు సాంఘీకీరించడం.డైలీ హంట్ ప్రతి నెలా 350 మిలియన్ల మంది మంత్లీ యాక్టివ్ యూజర్లకు సేవలందిస్తుంది.
రోజువారీ యాక్టివ్ యూజర్ ఖర్చు చేసే సమయం ఒక్కో వినియోగదారుకు రోజుకు 30 నిమిషాలు.ప్రత్యేకమైన AI/ML మరియు డీప్ లెర్నింగ్ టెక్నాలజీలు కంటెంట్ యొక్క స్మార్ట్ క్యూరేషన్ను ఎనేబుల్ చేస్తాయి.
వ్యక్తిగతీకరించిన కంటెంట్, నోటిఫికేషన్లను అందించడానికి వినియోగదారుల ప్రాధాన్యతలను ట్రాక్ చేస్తాయి.డైలీహంట్ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ తో పాటు మొబైల్ వెబ్ అందుబాటులో ఉంది.
అహ్మదాబాద్ లో ప్రధాన కార్యాలయం ఉన్న అదానీ గ్రూప్ భారతదేశంలో లాజిస్టిక్స్ (ఓడరేవులు, విమానాశ్రయాలు, లాజిస్టిక్స్, షిప్పింగ్, రైలు), వనరులు, విద్యుత్ ఉత్పత్తి, పునరుత్పాదక ఇంధనం, గ్యాస్ తో పాటు వైవిధ్యభరితమైన వ్యాపారాలలో వేగంగా అభివృద్ధి చెందుతున్న పోర్ట్ఫోలియో.మౌలిక సదుపాయాలు, వ్యవసాయం (సరకులు, వంట నూనె, ఆహార ఉత్పత్తులు, కోల్డ్ స్టోరేజీ ), రియల్ ఎస్టేట్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కన్స్యూమర్ ఫైనాన్స్, డిఫెన్స్ వంటివి ఇతర రంగాలు.
అదానీ విజయానికి, నాయకత్వ స్థానానికి ‘నేషన్ బిల్డింగ్’, ‘గ్రోత్ విత్ గుడ్నెస్’ అనే ప్రధాన తత్వానికి రుణపడి ఉంది.ఇది స్థిరమైన వృద్ధికి మార్గదర్శక సూత్రం.
CSR కార్యక్రమాల ద్వారా పర్యావరణాన్ని రక్షించడానికి, సమాజాలను మెరుగుపరచడానికి అదేవిధంగా స్థిరత్వం, వైవిధ్యం, భాగస్వామ్య విలువల సూత్రాల ఆధారంగా కట్టుబడి ఉంది.