దగ్గుబాటి ఫ్యామిలీ( Daggubbati Family ) కి చెందిన అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే.అహింస అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన అభిరామ్ తీవ్రంగా నిరాశ పర్చాడు.
తేజ దర్శకత్వం లో వచ్చిన అహింస( Ahimsa ) సినిమా ను చూసి ప్రేక్షకులు బాబోయ్ ఏంటి ఈ హింస అంటూ విమర్శలు చేశారు.సోషల్ మీడియాలో అభిరామ్ సినిమా పై తీవ్ర స్థాయి లో ట్రోల్స్ చేశారు.
అయినా కూడా అభిరామ్ వాటన్నింటిని పాజిటివ్ గానే తీసుకుంటాను.తదుపరి సినిమా విషయంలో జాగ్రత్త లు తీసుకుంటాను అన్నట్లుగా ఒక మీడియా సమావేశం లో మాట్లాడాడు.

ఇండస్ట్రీ లో ఉన్న వారు అలా ఉండకుంటే నెగ్గుకు రావడం కష్టం.కనుక అభిరామ్( Daggubati Abhiram ) ఆ తీరుగా ఉండటం మంచిదే అన్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఈ సమయంలోనే ప్లాన్ బి అనేది అభిరామ్ కు ఉండాలి అంటూ కొందరు సూచిస్తున్నారు.అల్లు శిరీష్( Allu Sirish ) హీరోగా ఇండస్ట్రీ లో చాలా కాలం అయ్యింది.
ఇప్పటి వరకు ఇండస్ట్రీ లో అభిరామ్ కనీసం సక్సెస్ అవుతాడు అనే నమ్మకం లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కనుక అభిరామ్ ఒక వైపు హీరోగా చేస్తూనే మరో వైపు నిర్మాణం లేదా ఇతర మార్గాల్లో రూట్ చూసుకుంటే బాగుంటుంది అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సోషల్ మీడియాలో భారీ ఎత్తున అభిరామ్ గురించి ట్రోల్స్ హీరో కాక ముందు నుండే జరుగుతున్నాయి.వాటన్నింటిని తట్టుకుని హీరోగా అహింస సినిమా తో వచ్చాడు.కనుక ముందు ముందు సక్సెస్ అవుతాడు అంటూ అంతా కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అయితే ఇండస్ట్రీ లో అనేది ప్లాన్ బి తప్పనిసరి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారితో పాటు ప్రతి ఒక్కరు కూడా అంటున్నారు.
ఆ మాటకు వస్తే అభిరామ్ కు మాత్రమే కాకుండా ఇండస్ట్రీ లో ఉన్న అందరికి కూడా ప్లాన్ బి అనేది ఉంటేనే బెటర్ అన్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.







