కాశ్మీర్ లో సిఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడి ఘటన మరిచిపోక ముందే మరో దురదృష్టకర ఘటన చోటు చేసుకుంది.ఉదయ్ పూర్ లో సిఆర్పీఎఫ్ క్యాంపులో ఓ జవాన్ ముగ్గురు సిఆర్పీఎఫ్ జవాన్లని కాల్చి చంపేసి తాను కూడా ఆత్మహత్యాయత్నం చేసాడు.
ఈ సంఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.నలుగురు కూర్చొని మాట్లాడుకుంటున్న సందర్భంలో ఇది జరిగినట్లు తెలుస్తుంది.
అజిత్ కుమార్ అనే జవాన్, తన తోటి జావాన్లతో మాట్లాడుతున్నా సందర్భంలో ఊహించని విధంగా వారి మధ్య గొడవ తలెత్తింది, దానికి కోపంతో ఊగిపోయిన అజిత్ కుమార్ తనని నిందించిన ముగ్గురు జవాన్లని తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చేసాడు.దీంతో వాళ్ళు అక్కడికక్కడే చనిపోయారు.
వారిని చంపేసిన అనంతరం అజిత్ కుమార్ కూడా తనని తాను కాల్చుకున్నాడు.ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది.
అయితే అజిత్ కుమార్ సైకో లా మారి అలా మిగిలిన వారిని చంపడానికి కారణం ఏంటి అనేది తెలియరాలేదు.