డే కేర్ సెంటర్ లో అన్నదానం చేసిన సిఆర్పి ఎఫ్ సీఐ

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లికి చెందిన ల్యాగల శ్రీనివాస్ రెడ్డి అనే (సిఆర్పిఎఫ్, సీఐ) తన ఇంట్లో జరిగే శుభకార్యక్రమానికి ముందుగా పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలని భావించి అన్నదానం చేయాలని ఎల్లారెడ్డి పేట మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ కు వివరించి అందులో ఉన్న వారి సంఖ్య,వారు తినే ఆహార పదార్థాల గురించి అడిగి తెలుసుకుని వంట చేయించి డే కేర్ సెంటర్ సిబ్బంది రమ్యకు అందజేశారు.

ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్,రమేష్ తదితరులు పాల్గొన్నారు.

కాగ సీఆర్ పి ఎఫ్ (సీఐ) శ్రీనివాస్ రెడ్డి కుటుంభం చల్లగా ఉండాలని డే కేర్ సెంటర్ లో ఉంటున్న వృద్దులు ఆశీర్వదించారు.

వంగిన విద్యుత్ స్తంభం...తృటిలో తప్పిన ప్రాణాపాయం.

Latest Rajanna Sircilla News