హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ( Himachal Pradesh Congress )ప్రభుత్వంలో సంక్షోభం తలెత్తింది.రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటు వేశారని తెలుస్తోంది.
దీంతో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ హిమాచల్ ప్రదేశ్ లో నెలకొన్న ప్రతిష్టంభనకు తెరదించేందుకు చర్యలు చేపట్టింది.ఇందులో భాగంగానే సీనియర్ నేతలు భూపిందర్ సింగ్, డీకే శివకుర్ పరిశీలకులు హిమాచల్ ప్రదేశ్ కు వెళ్లారు.
అనంతరం పరిశీలకులు అసంతృప్త ఎమ్మెల్యేలతో చర్చించనున్నారు.మరోవైపు హిమాచల్ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా( Shiv Pratap Shukla )ను బీజేపీ నేతలు కలిశారు.బల నిరూపణకు ఆదేశించాలని వారు గవర్నర్ ను కోరారని సమాచారం.దీంతో హిమాచల్ ప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.