వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన సీపీఐ నారాయణ..!!

వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో ఏపీ లో వివిధ పార్టీల నేతలు రకరకాల కామెంట్ చేస్తున్న సంగతి తెలిసిందే.

తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్, అదే విధంగా చంద్రబాబు ఇక అనేక నేతలు ఏపీ సీఎం వైఎస్ జగన్ బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి కాంట్రవర్సి కామెంట్లు చేయడం జరిగింది.

ఈ క్రమంలో తాజాగా సీపీఐ నారాయణ కూడా షాకింగ్ కామెంట్ చేశారు.మేటర్ లోకి వెళ్తే వైయస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి కారణం ఏమిటో .అసలు సంగతి ఏమిటో వైయస్ కుటుంబ సభ్యులే తేల్చాలని పేర్కొన్నారు.ఇంటి గుట్టు గనుక ఈ కేసుకు సంబంధించి ఏసిపి లేదా సిబిఐ దర్యాప్తు బృందాలు ఏమీ తీర్చలేని పరిస్థితి అని, ఏమాత్రం మానవత్వం లేదా నిజాయితీ ఉంటే కుటుంబ సభ్యులు అసలు విషయం బయటపెట్టాలని పేర్కొన్నారు.

ఈ క్రమంలో వైఎస్ విజయమ్మ ముందుండి ఈ విషయానికి సంబంధించి నాయకత్వం వహించాలని, వైయస్ వివేకానంద రెడ్డి కూతురికి కుటుంబ సభ్యులే న్యాయం చేయాలని సిపిఐ నారాయణ సంచలన కామెంట్ చేశారు.

ఇంతకీ.. కుప్పంలో బాబు గారి పరిస్థితేంటి ? 
Advertisement

తాజా వార్తలు