గాంధీలో దారుణం.. కొన్ని గంటలుగా క‌రోనా వార్డులోనే మృత‌దేహం!

హైదరాబాద్ ప్రజలు ప్రస్తుతం కరోనా వైరస్ కంటే కూడా గాంధీ ఆస్పత్రికే ఎక్కువ భయపడుతున్నారు.ఆ ఆస్పత్రిలో జరిగే ఘటనలు ఒకొక్కటి బయటకు తెలుస్తుంటే బాబోయ్.

మాకు గాంధీ వైద్యుల చికిత్స వద్దు హోం ఐసోలేషన్ చాలు అంటూ ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు.దీనికి కారణం గాంధీ ఆస్పత్రి కరోనా వార్డులో పరిస్థితిపై వచ్చిన వీడియోలే.

ఇంకా ఇప్పుడు అదే గాంధీ ఆస్పత్రిలో మరో దారుణం వెలుగు చూసింది.క‌రోనా బారిన‌ప‌డిన శ్రీ‌నివాస్ అనే రోగి.

గాంధీ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ నిన్న ఉదయం మృతిచెందాడు.అయితే అతని మృతిదేహాన్ని నిన్న ఉదయం నుండి బెడ్‌పైనే వదిలేశారు.

Advertisement

సుమారు రాత్రి 8 గంట‌లు అయినా అక్క‌డి నుంచి మృతదేహాన్ని త‌ర‌లించ‌లేదు.దీంతో ఆ మృత‌దేహం నుండి దుర్వాస‌న రావడంతో అది భరించలేక క‌రోనా వార్డులో ఉన్నవారు ఒకొక్కరుగా రూమ్ కాళీ చేసి వెళ్లిపోయారు.

ఈ విషయాన్నీ ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికి ఎవరు పట్టించుకోలేదని క‌రోనా రోగులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.ప్రస్తుతం ఈ ఘటన హైదరాబాద్ వాసులను కలవరపెడుతుంది.

Advertisement

తాజా వార్తలు