టాలీవుడ్ మంచి టాలెంటెడ్ దర్శకుడుగా తనదైన ముద్ర వేసిన దర్శకుడు గుణశేఖర్.కెరియర్ చేసిన సినిమాలు తక్కువే అయిన అందులో సూపర్ హిట్స్ ఎక్కువ.
తన సొంత ప్రొడక్షన్ లో రుద్రమ్మదేవి సినిమాని తెరకెక్కించిన గుణశేఖర్ ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకున్న కలెక్షన్స్ పరంగా అనుకున్న స్థాయిలో రాబట్టలేకపోయింది.ఆ సినిమా తర్వాత తన డ్రీం ప్రాజెక్ట్ గా హిరణ్యకశిప సినిమాని ప్రకటించాడు.
ఈ సినిమాలో రానా టైటిల్ పోషిస్తాడని, ఇది హిరణ్యకశిప పాయింట్ అఫ్ వ్యూలో నడిచే కథగా ఉంటుందని చెప్పాడు.ఇక ఈ స్క్రిప్ట్ పై రెండేళ్ళుగా గుణశేఖర్ సుదీర్ఘంగా వర్క్ చేస్తున్నాడు.
ఇక త్వరలో సెట్స్ పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపించింది.
ఇక ఈ సినిమాని ప్రారంభించాలని అనుకునే సరి కరోనా ఎఫెక్ట్ తో లాక్ డౌన్ మొదలైపోయింది.
ఇక ఈ లాక్ డౌన్ మొత్తం అన్ని రంగాలపై పడింది.సినిమా రంగం మీద కూడా భారీ స్థాయిలో ప్రభావం చూపించింది.వందల కోట్లు బడ్జెట్ పెట్టి తీస్తున్న సినిమాలు అన్ని ఆగిపోయాయి.దీంతో సినిమా బడ్జెట్ లు మరింత పెరిగిపోయే ప్రమాదం ఉంది.
సినిమాలు రిలీజ్ కాకపోవడంతో ఆ ప్రభావం నిర్మాతల మీద ఉంది.చిత్రపరిశ్రమలో లాక్ డౌన్ కారణంగా వేల కోట్ల వ్యాపారాలు ఆగిపోయాయి.
ఈ ప్రభావం ఇప్పుడు హిరణ్యకశిప సినిమా మీద పడింది.ఇప్పుడు రానా మూవీపై అంత భారీ బడ్జెట్ పెట్టడమంటే చాలా పెద్ద రిస్క్ చేయడమే అవుతుంది.
అదీగాక గుణశేఖర్ – రానా కాంబిపై డిస్టిబ్యూటర్లు పెద్దగా ఆసక్తి చూపించకపోవచ్చు.అందుకే నిర్మాత సురేశ్ బాబు ఈ సినిమాకి కొంత గ్యాప్ ఇచ్చి రానా మార్కెట్ పెరిగిన తర్వాత మొదలుపెట్టాలని భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.