దేశంలో మళ్లీ కరోనా విజృంభిస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి ఇప్పటికే మహారాష్ట్ర అదే విధంగా పూణే వంటి చోట్ల లాక్ డౌన్ చేపట్టే పరిస్థితి నెలకొన్నాయి.ఊహించని విధంగా కేసుల సంఖ్య పెరుగుతూ ఉన్న తరుణంలో ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్నాయి.
ఇదిలా ఉంటే కేరళ రాష్ట్రంలో కూడా కేసులు భారీగా ఇటీవల పెరుగుతూ ఉండటంతో పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రం కీలక నిర్ణయం తీసుకుంది.
కేరళ రాష్ట్రని సంబంధించి ఉన్న సరిహద్దులు మూసి వేస్తూ రాకపోకలు బంద్ చేసింది.
దీంతో కేరళ నుంచి వచ్చే అన్ని రహదారులను మూసివేసింది. కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై కేరళ మండిపడుతోంది.
దాదాపు రెండు రాష్ట్రాల ప్రజలు నిత్యం రాకపోకలు చేసే ఇలాంటి తరుణంలో ఒక్కసారిగా సడన్ గా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం బాధాకరమని కేరళ రాష్ట్రానికి చెందిన ప్రజా ప్రతినిధులు మండిపడుతున్నారు.