తురక కాశి కుటుంబాలను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది - కేకే మహేందర్ రెడ్డి

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని దుమాల శివారులో గల తురక కాశి కుటుంబాలను( Turaka Kashi families ) ఆదుకుంటామని సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి గురువారం అన్నారు.

ఈ సందర్భంగా 60 మంది కాంగ్రెస్ పార్టీలోకి చేరగా వారికి కండువాలు కప్పి సాదర పూర్వకంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటవీ ప్రాంతంలో ఇటు గుట్టల ప్రాంతంలో బండరాళ్లు కొడితే కేసులు పెడుతూ తురుక కాశీలను ప్రభుత్వం ఇబ్బందుల పాలు చేయడం జరుగుతుందన్నారు.వీరికి ఇప్పటివరకు కనీసం ఇండ్లను ప్రభుత్వం నిర్మించి ఇవ్వలేదన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వీరిని ఆదుకుంటామని ఆరు స్కీముల గ్యారంటీ పథకంలో వీరిని ఆదుకొని వీరి కుటుంబాలను బాగుపరచడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ గౌస్, జిల్లా ప్రధాన కార్యదర్శి పసుల కృష్ణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాట నరసయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి, నాయకులు రవి,రఫీక్, చెన్ని బాబు, సలీం, కాశీం తదితరులు పాల్గొన్నారు.

రౌడీ షీటర్స్ సత్ప్రవర్తనతో మెలగాలి - కోనరావుపేట ఎస్ఐ శేఖర్ రెడ్డి
Advertisement

Latest Rajanna Sircilla News