ప్రస్తుతం దేశంలో ఉన్న జాతీయ పార్టీలు ఏవంటే.ఎవరైనా కాంగ్రెస్, బీజేపీ పార్టీలే అని చెబుతారు.
ఎందుకంటే ఈ రెండు పార్టీలకు ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది.దేశంలో అన్నీ వైపులా ఈ రెండు పార్టీలు మాత్రమే అత్యంత ప్రజాధరణ కలిగినవిగా చెప్పుకోవచ్చు.
అందుకే కేంద్రంలో అధికారం కోసం ఈ రెండు పార్టీల మద్యనే ప్రధాన పోరు ఉంటుంది.ప్రస్తుతం దేశంలో అన్నీ వైపులా బీజేపీ ( BJP ) హవానే నడుస్తోంది.
మోడి మేనియాతో గత తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ వచ్చే ఎన్నికల్లో కూడా అధికారం కోసం ఉవ్విళ్లూరుతోంది.అటు కాంగ్రెస్( Congress Party ) ఒకప్పటితో పోల్చితే కాస్త బలహీన పడినప్పటికి.
ప్రస్తుతం తిరిగి బలం పెంచుకుంటోంది.
దీంతో వచ్చే ఎన్నికల్లో హోరాహోరీ పోరు తప్పదనే చెప్పవచ్చు.అయితే ఉత్తరాడిన ఈ రెండు పార్టీలకు తిరుగులేనప్పటికి.అసలు సమస్యంతా దక్షిణాది రాష్ట్రాలలోనే.
ప్రంతియాభిమానం అధికంగా ఉండే దక్షిణాదిలో ఈ రెండు జాతీయ పార్టీలకు ఆధారణ తక్కువ ఎన్నో ఏళ్లుగా దక్షిణాదిలో బలపడాలని చూస్తున్న బీజేపీ కోరిక కలగానే మిగులుతోంది తప్పా నెరవేరడం లేదు.మొన్నటివరకు కర్నాటకలో( Karnataka ) అధికారంలో ఉన్న బీజేపీ ఇప్పుడు ఆరాష్ట్రంలో కూడా అధికారాన్ని కోల్పోయింది.
దీంతో దక్షిణాదిన బీజేపీ శూన్యంగా మిగిలింది.అయితే బీజేపీతో పోల్చితే దక్షిణాది రాష్ట్రాలలో కాంగ్రెస్ కొంత బలంగా ఉంది.
ప్రస్తుతం అధికారంలో ఉన్న కర్నాటక రాష్ట్రంతో పాటు తెలంగాణలో( Telangana ) కూడా కాంగ్రెస్ కొంతమేర ప్రభావం చూపగలదు.ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలలో ఇంకా బలం పెంచుకోవాల్సిన అవసరం ఉంది.అయితే ఈ రాష్ట్రాలలో జాతీయ పార్టీలు బలపడడం కష్టమే అని విశ్లేషకులు చెబుతున్నారు.వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించాలంటే దక్షిణాది రాష్ట్రాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి.
మరి ఎన్నికలకు సరిగా ఏడాది మాత్రమే సమయం ఉంది.మరి ఏ ఏడాదిలో ఈ రెండు జాతీయ పార్టీలు దక్షిణాది రాష్ట్రాలలో బలపడేందుకు ఎలాంటి వ్యూహాలు రచిస్తాయి.
ఏ పార్టీలతో పెట్టుకుంటాయనేది చూడాలి.