రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వం రద్దుపై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది.అనర్హత వేటుకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని కాంగ్రెస్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
మోదీ నిరంకుశ పాలనను నిరసిస్తూ ఆందోళనలు చేసేందుకు రెడీ అయ్యింది.ఈ మేరకు ఢిల్లీలో భారీ ర్యాలీ నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది.
అదేవిధంగా భవిష్యత్ కార్యాచరణపై ఏఐసీసీ కమిటీ వేయనుంది.విపక్ష పార్టీలతో కలిసి రాజకీయ కార్యాచరణ రూపొందించనుంది.
మరోవైపు అనర్హత వేటుపై తీసుకోవాల్సిన చర్యలపై కాంగ్రెస్ లీగల్ టీమ్ సమాయత్తం అవుతుందని సమాచారం.