తెలంగాణాలో తిరుగులేని మెజార్టీ సీట్లను సాధించిన టీఆర్ఎస్ పార్టీ … మళ్ళీ తన ప్రత్యర్థి పార్టీల నుంచి బలమైన నాయకులను పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో బలమైన నాయకుడిగా ఉన్న గండ్ర వెంకటరమణారెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే … ఈ వార్తలను గండ్ర కొట్టిపారేశారు.
శాయంపేట మండలం జోగంపల్లి చలి వాగు ప్రాజెక్ట్ నుంచి గండ్ర వెంకటరమణారెడ్డి సాగునీరు విడుదల చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.హస్తం గుర్తుపై గెలిచిన తాను టీఆర్ఎస్లోకి వెళ్తున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని చెప్పారు.
తనకు రెండు సార్లు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేగా పని చేసిన అనుభవం ఉందన్నారు.కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే.
ప్రతిపక్ష నేత హోదా సమర్థవంతంగా నిర్వహిస్తాను అంటూ… తన మనసులో మాట బయటపెట్టుకున్నారు.