కాంగ్రెస్ పై మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు దిగజారి మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు.
రైతుబంధు దండగ అని కాంగ్రెస్ నేతలు అంటున్నారన్న మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పథకాలు రావని చెప్పారు.ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేతలకు మాటలు ఎక్కువన్న ఆయన చేతలు తక్కువంటూ ఎద్దేవా చేశారు.
అలాగే కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ చేతుల్లో కీలు బొమ్మలని విమర్శించారు.వారు ప్రజా సమస్యల కోసం కాకుండా కుర్చీల కోసమే కొట్లాడుతారని ఆరోపించారు.
అయితే తెలంగాణ ప్రజల జీవితాల్లో మార్పులు తెచ్చింది మాత్రం కేసీఆర్ మాత్రమేనని తెలిపారు.దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్పారు.
ఈ నేపథ్యంలోనే మూడోసారి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.