ఇందిరమ్మ అభయం పై తులసిరెడ్డి వ్యాఖ్యలు.అనంతపురం లో కాంగ్రెస్ ఎన్నికల శంఖారావం సభలో AICC అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే గారు మొదటి గ్యారెంటీ పథకంగా ఇందిరమ్మ అభయం పథకాన్ని ప్రకటించారు.ఈ పథకం క్రింద ప్రతి నిరుపేద కుటుంబానికి ప్రతి నెలా రు.5000 ఆర్థిక సహాయం. ఇది చారిత్రాత్మక పథకం.దేశం లోనే ప్రప్రథమంగా ఆంధ్రప్రదేశ్ లోనే.వైకాపా అమలు చేస్తున్న అన్ని పథకాలు కలిపినా ఈ పథకానికి సరి రావు.
తెలుగు దేశం పార్టీ ప్రకటించిన సూపర్ సిక్స్ ఈ పథకం ముందు బలాదూర్.
మహిళల ఖాతాలో జమ అవుతుంది.ఇందిరమ్మ అభయం పేదలకు కాంగ్రెస్ వరం.ఇందిరమ్మ అభయం మహిళలకు కాంగ్రెస్ వరం.ఈ పథకం అమలు కావాలంటే కాంగ్రెస్ అధికారం లోకి రావాలి.కాంగ్రెస్ అధికారం లోకి రావాలి అంటే హస్తం గుర్తుకు ఓటెయ్యాలి.